కంబదూరు మండలంలోని ఎర్రమల్లేపల్లిలో ఎర్రిస్వామి కుటుంబం ఇంటిముందు సిమెంట్ పెళ్లలతో తాత్కాలికంగా గోడలు నిర్మించుకుని గుడిశె వేసుకొంది. ఉక్కపోత తీవ్రంగా తీవ్రంగా ఉండటంతో కుటుంబసభ్యులు అందరూ ఇంటిముందు గుడిసెలో నిద్రిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తీవ్రమైన గాలులు వీయడంతో గుడిసె పైకప్పు లేచిపోయింది. అదే సమయంలో గోడకు ఉన్న సిమెంట్ ఇటుకలు కూడా కూలి కుటుంబసభ్యులపై పడటంతో ఎర్రిస్వామి, రామాంజినమ్మ, శ్వేత, తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సంఘటనలో శ్వేత (7) తల్లీకూతుళ్ళు మరణించారు. స్థానికులు 108కు ఫోన్ చేయడంతో వాహన సిబ్బంది బాధితులను కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన రామాంజనమ్మ (30), శ్వేత(7)లు మార్గమధ్యంలోనే మరణించారు. అనంతరం తీవ్రగాయాలతో ఉన్న ఎర్రిస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.