హైదరాబాద్‌లో దారుణం : చిన్నారి బైక్‌కు అడ్డొచ్చిందనీ పెట్రోల్ పోసి నిప్పంటిచారు..

బుధవారం, 5 అక్టోబరు 2016 (08:46 IST)
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. హత్యలు, అత్యాచార ఘటనలు అధికంగానే జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ దారుణం వీటికి నిదర్శనంగా మారింది. 
 
హైదరాబాదు పాతబస్తీలోని కాలాపత్తర్‌లో మహమ్మద్ అలీషేర్ అనే రెండేళ్ళ బాలుడు.. మహ్మద్ ఫైసల్ ఖాన్ అనే వ్యక్తి బైక్‌కు అడ్డొచ్చాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఫైసల్... ఆ బాలుడిపై పెట్రోల్ పోశాడు. అయితే, రెండేళ్ళ బాలుడికి అదేంటో తెలియకుండా.. నవ్వాడు. 
 
అంతే... ఒక్కసారి ఆగ్రహంతో రగిలి పోయిన పైసల్.. అగ్గిపుల్ల గీసి ఆ బాలుడి శరీరంపై వేశాడు. దీంతో అలీ షేర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిని చూసిన బంధువులు సత్వరమే స్పందించి, అలీషేర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి