తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఘనశ్యామ్ (27) అనే యువకుడు బాపూజీనగర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో వివాహం జరిగింది. అయితే, క్రికెట్ బెట్టింగ్కు అలవాటుపడిన ఘనశ్యామ్ ఎంతో నష్టపోయాడు. చివరకు, తన భార్యకు చెందిన 28 తులాల బంగారు నగలను కూడా బెట్టింగ్లో ఫణంగా పెట్టి మొత్తం బంగారాన్ని కోల్పోయాడు.
దీంతో, తీవ్ర మనస్తాపం చెందిన ఘనశ్యామ్, కుటుంబసభ్యులందరూ నిద్రిస్తున్న సమయంలో, గురువారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘సారీ మమ్మీ, సారీ డాడీ..’ అని ఆ లేఖలో రాసి ఉంది.