ఈ సందర్భంగా ట్రస్టు సేవల గురించి ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యుల నుంచి తెలుసుకున్నట్లు సమాచారం. సత్యసాయికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని, ఇలాంటి సేవాసంస్థ దేశంలో ఎక్కడా లేదని బాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి అభివృద్ధి, సత్యసాయి ట్రస్టుకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలు చేయూతనిస్తానని ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.