ఈ దేశంలో ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనేక కేసులు నమోదై ఉన్నాయని, వారిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని అలాంటపుడు తాను మాత్రం ఎందుకు చేస్తానని తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మన దేశంలో సుమారు 200 మందికి పైగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులపై వివిధ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. వీటిల్లో అత్యధికం విచారణ దశలో ఉన్నాయని, వీరెవ్వరూ రాజీనామాలు చేయలేదని అన్నారు. వీరిలో ఏ నేతకూ వర్తించని చట్టం తనకు మాత్రం ఎందుకు వర్తిస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.