కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీనివాసులు కుమారుడు లోకేష్ చిత్తూరు జిల్లా సి.రామాపురం పంచాయతీ కోదండరామాపురంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఈనెల 19వ తేదీన వెల్లడైన ఇంటర్మీడియల్ పరీక్షల్లో ఫెయిలైనట్లు ఫలితాలు రావడంతో లోకేష్ మనస్థాపానికి గురయ్యాడు. తన కుమారుడు ఫెయిలైనా తండ్రి శ్రీనివాసులు అదే కళాశాలలో ఎంసెట్కు శిక్షణలో చేర్పించాడు.