యాకూబ్ మెమన్కు ఉరి పడక ముందు తరువాత కూడా ఉరిపై మళ్ళీ మరోమారు చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఎక్కడ చూసినా ఉరిపైనే చర్చ. అసలు ఉరి శిక్ష అమలు చేయాలా? వద్దా? దేశంలో ఎక్కడెక్కడ ఉరి తీసే జైళ్లు ఉన్నాయనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉరి శిక్ష అమలు చేసే జైళ్ళు ఉన్నాయా? ఎక్కడెక్కడ? ఎంతమందిని ఉరి తీశారు.?
ఇక్కడ అమలైన ఉరిశిక్షల వివరాలు చూస్తే.. రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలోని ఉరికంభం నుంచి మొత్తం 458 మందిని ఉరి తీశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఇక్కడ 47 మంది ఖైదీలను ఉరి తీశారు. 1948లో ఐదుగురుని, 1949లో ముగ్గురిని, 1957లో ఒకరిని, 1959లో 8 మందిని, 1961లో ఇద్దిరిని ఉరితీశారు.
1962లో నలుగురిని, 1963లో ఏడుగురిని, 1964లో ఐదుగరుని, 1967లో ముగ్గురిని, 1968లో ఒకరిని, 1971లో ముగ్గురిని, 1972,74,76లలో ఒక్కొక్కరిని చొప్పున ఉరి తీశారు. చివరిగా ఫిబ్రవరి 1976లో అనంతపురానికి చెందిన నంబి కిష్టప్ప అనే ఖైదీని ఉరితీసారు. తరువాత ఇప్పటి వరకూ ఎటువంటి ఉరి అమలు కాలేదు.