తాను కరీంనగర్లో పుట్టి వరంగల్లో పెరిగానని ఇపుడు అమెరికాలో నివసిస్తున్నానని ప్రత్యూష చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో బాలబాలికల విద్య, మంచినీటి వసతిపై దృష్టి పెట్టానని, ఈ విషయం చెప్పినపుడు కేసీఆర్ కూడా అభినందించారని ఆమె వివరించారు.