కేసీఆర్‌ను కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా: ప్రత్యూష

బుధవారం, 28 జనవరి 2015 (10:55 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మిస్ ఆసియాగా ఎంపికైన గూడురు ప్రత్యూష పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును సచివాలయంలో కలిశారు.

అనంతరం ఆమె స్పందిస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా అయిన కేసీఆర్‌ను కలవడం పట్టరాని ఆనందం కలిగించిందని అన్నారు. 
 
తాను కరీంనగర్‌లో పుట్టి వరంగల్‌లో పెరిగానని ఇపుడు అమెరికాలో నివసిస్తున్నానని ప్రత్యూష చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో బాలబాలికల విద్య, మంచినీటి వసతిపై దృష్టి పెట్టానని, ఈ విషయం చెప్పినపుడు కేసీఆర్ కూడా అభినందించారని ఆమె వివరించారు.

వెబ్దునియా పై చదవండి