చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతోంది. ఈనెల 23,24 తేదీలలో ఇప్పటికే చిత్తూరులో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటర రాష్ట్రాల్లో దాడులు కొనసాగాయి. అయితే పరిశ్రమలకు సంబంధించిన లావాదేవీలను మాత్రమే ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకోగా నిన్న జరిగిన దాడుల్లో 284కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.