పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవుపై వెళ్లడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ విమర్శించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరైతే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
అయితే చాలా కొత్తగా, పార్టీలో మార్పుకోసం మంచి అజెండాతో పార్టీ ఉపాధ్యక్షుడు తిరిగి వస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తను రాసిన కొత్త పుస్తకం 'ఇండియా సహస్త్ర'పై ఢిల్లీలో చర్చ సందర్భంగా థరూర్పై విధంగా మాట్లాడారు.