బఫూన్లన్న జగన్: టీడీపీ-వైసీపీల మాటల వార్.. సభ వాయిదా!

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (14:13 IST)
టీడీపీ-వైసీపీల మధ్య మాటల యుద్ధానికి అసెంబ్లీ వేదిక అయ్యింది. శాంతిభద్రతలపైన శుక్రవారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. హత్యారాజకీయాలపై ఇరు పార్టీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేశారు. 
 
ఈ క్రమంలో వైకాపా ఫ్యాక్షనిజంను పెంచి పోషించిందని, జగన్ హంతకుడని, నేరస్తుడని టీడీపీ విమర్శించగా, జగన్ ఆవేశంతో ఊగిపోయారు. ఏకంగా టీడీపీ నేతలను బఫూన్‌లు అని ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అసెంబ్లీ వేడెక్కింది. 
 
టీడీపీ నేతలు జగన్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని లేదా బేషరతుగా క్షమాపణ చెప్పించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే సభలో ఆందోళనలు సద్దుమణగక పోవడంతో స్పీకర్ కోడెల సభను శనివారానికి వాయిదా వేశారు. 

వెబ్దునియా పై చదవండి