జగన్ బఫూన్ వ్యాఖ్యలు : క్షమాపణ చెప్పిస్తారా... లేదా సస్పెండ్ చేస్తారా?

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:56 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బఫూన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. టీడీపీ సభ్యులు తనపై చేసిన ఆరోపణలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
 
విపరీతమైన ఆవేశంతో ఊగిపోతూ 'మీలాంటి బఫూన్‌లతో మాటలు అనిపించుకుంటుంటే... నాకెలా ఉంటుందంటే'అని ... ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేయగానే సభలో తీవ్రకలకలం రేగింది. 
 
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రజా ప్రతినిధి సంయమనం పాటించకుండా ఇలాంటి పదాలు వాడటం సబబు కాదని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇంకా జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదా ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి