తనను మైకు కోరలేదని స్పీకర్ అనడంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభ్యుడు శ్రీనివాసులు స్పీకర్ కార్యదర్శితో మాట్లాడారని చెప్పారు. అయినా సరే మైకు అందలేదని అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఉద్దేశించి మాట్లాడుతూ "రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి స్పీకర్ మీరే. సంప్రదాయాలను పాటించాలి" అని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం సరికాదన్నారు.