మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రోద్బలంతోనే దాడులు, దౌర్జన్యాలు జరిగాయని గొట్టిముక్కల గ్రామ స్థానికులు ఆరోపించారని పేర్కొన్నారు. మొన్నటి వరకు 11 మంది హత్యకు గురయ్యారని, ఈ రెండురోజుల్లో మరో ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు. శాంతి భధ్రతలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో మార్పు కోరుకుంటుంటే గతంలోకి వెళ్లి అవాస్తవాలు చెబుతున్నారని, చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఇదే అంశంపై పలువురు వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో జరిగిన 14 హత్యలపై చర్చ జరగాలని తాము కోరుతుంటే టీడీపీ సభను తప్పుదారి పట్టిస్తోందని కొడాలి నాని ఆరోపించారు. సభలో టీడీపీ తీరు చూస్తే ఇకపైనా వైసీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తారనే భయం కలుగుతోందన్నారు. దురుద్దేశంతోనే పరిటాల రవి హత్యకేసులో జగన్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.