వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపి) అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మెగా ఆఫర్ ఇచ్చేశారు. టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నట్లు తన వద్ద లక్ష కోట్లు ఉంటే పది శాతం మాత్రం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చని ఆఫర్ చేశారు. పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.