మెదక్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక కోర్టులో లొంగిపోయారు. 2011-12లో సదాశివపేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో నర్సింహులు అనే వ్యక్తి రేషన్ బియ్యం బాగోలేవని ఆరోపించడంతో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి అతనిపై చేజేసుకోవడం వివాదాస్పదమైంది.