ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ముక్కలు చేయలేదనీ, నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కె. రోశయ్యే ఖరారు చేశారనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. 2013 అక్టోబర్ 8వ తేదీనే రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.
ఇందులో జైరాం రమేష్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కె.రోశయ్య తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఓ తీర్మానం చేశారనీ ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 2013 అక్టోబర్ 8న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. రెండుప్రాంతాల్లోని రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజన చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉందని చెప్పారు. హైకోర్టు విభజనపై అప్పుడే హోం శాఖ కార్యదర్శులకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు. అయినా ఇప్పటివరకు హైకోర్టు విభజన పూర్తి చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. అన్ని ఆధారాలతోనే పుస్తకాన్ని రాసినట్టు పేర్కొన్నారు.