పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. సైనిక కుటుంబాల కోసం రూ.కోటి విరాళం

బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (15:36 IST)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును ఈ సందర్భంగా సైనికాధికారులకు అందచేస్తారు. 
 
ఇటీవల మిలిటరీ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ అమర సైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొంటున్నారు.
 
విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన షార్ట్ ఫిలింను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి మేఘాలయ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య  సింధియా కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు