కరువు పరిశీలన అంటే ఇలాగేనా... ఇలా వచ్చి అలా వెళ్లితే తెలిసేదేమిటి? అరగంటైనా కూర్చుని మాట్లాడితే విషయం తెలుస్తుంది. అలా కాకుండా ఇలా వాహనాల్లో వచ్చి, అలా ఐదు నిమిషాలు నిలబడి చూసి వెళ్లినంత మాత్రనా కరువు పరిశీలన అయిపోతుందా..? అని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్అహ్మద్ నేతృత్వంలో డీఏసీ జేడీ నరేంద్రకుమార్, మానిటరింగ్ అండ్ అప్రైసర్ డెరైక్టరేట్ డెరైక్టర్ పంకజ్త్యాగి, ఫుడ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఏపీ రీజియన్ డీజీఎం గోవర్థన్రావులతో కూడిన బృందం బుధవారం అనంతపురంలో పర్యటించిన విషయం తెలిసిందే