పరిటాల రవి హత్య కేసుతో లింకు లేదు : జేసీ దివాకర్ రెడ్డి

మంగళవారం, 19 ఆగస్టు 2014 (14:01 IST)
టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ హత్య కేసుకు సంబంధించి తనపై గతంలోనే విచారణ చేశారని... అవసరమనుకుంటే మరోసారి విచారణకు తాను సిద్ధమని చెప్పారు. వైకాపా అధినేత జగన్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి హత్యతో తనను ముడిపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి