పవర్ స్టార్ అభిమాని వినోద్ రాయల్ ఇంటికి జూనియర్ ఎన్టీఆర్... ఒంటరిగా వచ్చి పరామర్శించి...

గురువారం, 1 సెప్టెంబరు 2016 (12:15 IST)
తిరుపతిలో ఒక్కసారిగా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ప్రత్యక్షమయ్యాడు. అది కూడా తన అభిమానుల చేతిలో దారుణంగా హత్యకు గురైన వినోద్‌ రాయల్‌ ఇంటి ముందే. అతి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నేరుగా కారులో వినోద్‌ రాయల్‌ ఇంటికి వచ్చాడు. వినోద్‌ తల్లిదండ్రులు వేదవతి, వెంకటేష్‌లకు ధైర్యం చెప్పాడు. మీకు నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పాడు. అభిమానులను ఇప్పటికే హెచ్చరించానని, ఇద్దరి మధ్య ఘర్షణ ఒక ప్రాణాన్ని బలిగొనడం దారుణమని జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
 
జనతా గ్యారేజ్‌ సినిమా ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో పవన్‌ అభిమానులు తిరుపతిలో ఏదైనా ఆందోళనా కార్యక్రమాలు చేస్తారన్న ఆలోచనతో ముందుగానే జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తిరుపతికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తమ ఇంటికి వచ్చిన విషయాన్ని వినోద్‌ తల్లిదండ్రులు కూడా మీడియాకు చెప్పడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం వచ్చివెళ్లినట్లు మీడియా వారికి సమాచారం అందింది. ఆయనను కెమేరాలో బంధించాలనుకునేసరికే తిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి