కాగా, అధికార టీఆర్ఎస్ శాసనమండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ పార్టీ వామపక్షాలు, ఎంఐఎం మద్దతు కోరగా, తాజాగా వైకాపా మద్దతును కోరింది.
అయితే, ఆయా పార్టీలు తమ వైఖరిని వెల్లడించాల్సి ఉంది. కాగా, మండలిలో తమ వారినే గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని గత కొన్ని రోజులుగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.