దుర్గమ్మ గుడిలో నీలిచిత్రాలు చూసిన పోలీస్ సస్పెండ్!

బుధవారం, 1 అక్టోబరు 2014 (18:41 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రుల సందర్భంగా అపచారం జరిగింది. దుర్గమ్మ గుడిలో నీలిచిత్రాలు చూసిన పోలీస్ సస్పెండ్ అయ్యాడు. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్‌లో నగ్న చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. 
 
సీఐ ప్రసాద్ విధి నిర్వహణను పక్కన పెట్టి ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ఫోన్లో నగ్న చిత్రాలను చూస్తుండగానే మీడియా తమ కెమెరాలో ఈ బూతుపురాణాన్ని బంధించేసింది. దీంతో అధికారులు సీఐని అదుపులోకి తీసుకుని... అతనిని సస్పెండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి