కేసీఆర్‌తో జయప్రద సమావేశం..! పార్టీ వర్గాలలో కలకలం..!

శనివారం, 21 ఫిబ్రవరి 2015 (17:24 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖ సినీ నటి జయప్రద కలుసుకున్నారు. సచివాలయ ప్రాంగణంలో శనివారం ఉదయం ఆమె కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ వార్త పార్టీ వర్గాలలో కలకలం రేపింది. అయితే అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరి కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకే కేసీఆర్‌ను కలిసినట్లు తెలిపారు.
 
కేసీఆర్‌కు పత్రికను ఇచ్చి సోదరి వివాహానికి ఆహ్వానించినట్టు తెలిపారు. అంతే తప్ప తమ మధ్య ఇంకేమీ మంతనాలు జరగలేదని ఈ సందర్భంగా జయప్రద స్పష్టం చేశారు. వెంటనే ఆమె ఆమె సచివాలాయం నుంచి బయటకు వెళ్లిపోయారు.

వెబ్దునియా పై చదవండి