ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉన్న అన్ని వాహనాలకు ఉన్నట్టుగానే ఈ బస్సుకు కూడా అన్నీ ఆరులతో టీఎ్స07జడ్6666 నెంబరును కేటాయించారు. రిజిస్ట్రేషన్ అనంతరం సీఎం కార్యాలయ అధికారి అజిత్, భద్రతా సిబ్బంది, ఆర్టీసీ అధికారులు బస్సులో యాదగిరి గుట్టకు చేరుకున్నారు. ఆలయ పడమటి రాజగోపురం ఎదుట వేదమంత్రాలతో పురోహితులు, అర్చకులు సంప్రదాయ రీతిలో వాహన పూజలు నిర్వహించారు.