శేఖర్, సంధ్య అనే ప్రేమికులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో తన ప్రియురాలి భుజంపై చేతులు వేసి వెళుతున్న ప్రియుడు... ఉన్నట్టుండి ఆమెను వేగంగా వస్తున్న లారీ కిందకు తోసి పరారయ్యాడు. లారీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో వాహనాన్ని పక్కకు మళ్లించడంతో యువతి ప్రాణాలు మిగిలాయి. తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఈ యువతి అపస్మారక స్థితిలో ఉన్నందున, ఘటన వెనక అసలు కథ తెలియడం లేదని పోలీసులు తెలిపారు. కాగా, వీరిద్దరికీ కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు సమాచారం. రోడ్డుపై నడుస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ఘటనను చూసిన కొందరు స్థానికులు వెల్లడించారు. శేఖర్ పారిపోగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.