కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్దంతి... కుటుంబం నివాళి

మంగళవారం, 2 నవంబరు 2021 (12:43 IST)
మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్దంతిని ఆ కుటుంబం ఘ‌నంగా నిర్వ‌హించింది. టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మలి మండలం, నిమ్మాడలోని ఎర్ర‌న్నాయుడు స్వగ్రామంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.
 
 
కింజరాపు ఎర్రన్నాయుడు గారి 9వ వర్దంతి సందర్భంగా ఆయ‌న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఎర్రన్నాయుడు సతీమణి విజయకుమారి క‌న్నీళ్ళ ప‌ర్యంతం అయ్యారు. ఆమె కుటుంబ సమేతంగా టెక్కలి నియోజకవర్గ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు హరివరప్రసాద్, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని  ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.


వారితో పాటు జిల్లాలోని ముఖ్య నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాలు గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. జోహార్ జోహార్ కింజరాపు ఎర్రన్నఅమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు