ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నుంచి ఒక యేడాది పాటు సస్పెన్షన్కు గురైన వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా అంశంపై సోమవారం శాసనసభ దద్ధరిల్లింది. ఆ సమయంలో అధికార, విపక్ష శాసనసభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ కల్పించుకున్నారు.
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయమని వైకాపా కోరుతున్న పద్ధతి సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "తప్పు జరిగింది, మరోసారి ఇలా జరగనివ్వబోము. సస్పెన్షన్ ఎత్తివేయండని కోరితే పరిస్థితి మరోలా ఉండేది. అలా చేయకుండా, సభ తప్పు చేసింది. తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించడం సరికాదు" అన్నారు. అంతకుముందు రోజాపై ఎట్టి పరిస్థితుల్లోను సస్పెన్షన్ తొలగించే పరిస్థితే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది