ఆ తర్వాత గత సంవత్సరం మహిళా ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన కింది కోర్టు ఆమె చేసింది తీవ్రమైన నేరమని అభిప్రాయపడుతూ, ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన తీర్పును తిరుపతి కోర్టులో వసంత కుమారి సవాల్ చేయగా, ఆ కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది.