గుంటూరు అధ్యాపకుడిపై విద్యార్థిని యాసిడ్ దాడి...!

శనివారం, 20 డిశెంబరు 2014 (16:12 IST)
గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో శనివారం దారుణం చోటు చేసుకుంది.  ఓ లెక్చరర్పై విద్యార్థిని యాసిడ్తో దాడి చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను ఆస్పత్రికి తరలించారు.  
 
తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. అందుకే యాసిడ్ దాడికి పాల్పడినట్లు ఆమె అంగీకరించింది. కాగా లెక్చరర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి