1957, జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించిన ఈయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఆయన విద్యాభ్యాసం పెదనందిపాడు, గుంటూరులో సాగింది. గుంటూరులో కొన్నాళ్లు న్యాయవాదిగా విధులు నిర్వహించి అనంతరం రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు.
అక్కడ సుమారు దశాబ్ద కాలం న్యాయవాదిగా పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రముఖ కేసులను చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2003-04 అనంతరం 2013-14 కాలంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేసి మంచి గుర్తింపు పొంది ఇపుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.