వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన గుంటూరు జిల్లాలోని మాచర్ల పట్టణంలో శనివారం నాడు వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... మాచర్లకు చెందిన 30 ఏళ్ల మక్కెన శ్రీనివాసరావు బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మన్గా ఉన్నాడు. వినుకొండలోని కొండ్రముట్ల గ్రామానికి చెందిన శశిరేఖ అనే మహిళను వివాహం చేసుకుని, గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు.