హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ రాజా బ్యాటరీస్ తరపున రూ. కోటి చెక్కును చంద్రబాబుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అందజేశారు.