లేదని రవీందర్ దంపతులు మీడియాకు తెలిపారు. తన భార్య రణితకు టిబి, అల్సర్ వ్యాధులు ఉన్నాయని రవీందర్ చెప్పారు. ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నవారికి, కొత్తగా చేరబోయేవారిని ఎలాంటి సలహా ఇవ్వదలుచు కోలేదని, తమకు చేతనైనంత కాలం పార్టీలో పనిచేశామని, ఇప్పుడు తమ వల్ల కావడం లేదని అన్నారు.
పార్టీకి లేఖ రాసి, ఆయుధాలు వదిలేసి వచ్చామని, పూర్తిగా జనజీవన స్రవంతిలో జీవిస్తామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదం, ఐఎస్ఐతో మవోయిస్టు పార్టీకి సంబంధాలు పూర్తి అబద్ధమని, నేపాల్ మావోయిస్టులతో సంబంధాలు మాత్రం కొట్టిపారేయలేమని చెప్పారు.