ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహితను అసభ్యంగా చిత్రీకరించి యువకులు వేధింపులకు గురిచేయడంతో, తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శానిటోరియం చెంచులిపేటకు చెందిన పండా ఉషా అనే వివాహితకు చెందిన ఫోటోలను గువ్వల బాలాజీ అలియాస్ బాలు అనే యువకుడు అతడి స్నేహితులు సెల్ఫోన్లో చిత్రీకరించి, ఆమెను తరచు వేధించసాగారు.