రాజమండ్రిలో యువకుల వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

ఆదివారం, 24 మే 2015 (13:08 IST)
ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహితను అసభ్యంగా చిత్రీకరించి యువకులు వేధింపులకు గురిచేయడంతో, తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శానిటోరియం చెంచులిపేటకు చెందిన పండా ఉషా అనే వివాహితకు చెందిన ఫోటోలను గువ్వల బాలాజీ అలియాస్ బాలు అనే యువకుడు అతడి స్నేహితులు సెల్ఫోన్లో చిత్రీకరించి, ఆమెను తరచు వేధించసాగారు. 
 
ఆమె పలుమార్లు వేడుకున్నా ఆ ఫోటోలను తిరిగి ఇవ్వలేదని తెలిస్తోంది. ఆ వేధింపులు భరించలేక ఆదివారం ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోతూ పోలీసులకు లేఖ రాసింది.
 
అందులో గువ్వల బాలరాజు అతడి స్నేహితులు తనను మానసికంగా వేధించారంటూ ఆ లేఖలో పేర్కొంది. దాంతో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.   

వెబ్దునియా పై చదవండి