మెదక్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఇవాళ మెదక్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ... మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేసి పాలనను వికేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు. పాలన దృష్ట్యా సిద్దిపేటను కూడా జిల్లాగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.