వచ్చిపోయే వారిపై దాడి చేయడం మొదలు పెట్టాడు. తీరా ఆ వ్యక్తి మతిస్థిమితం లేని వాడని తేలిపోయింది. వచ్చి పోయే వారి కార్లపై అతడు రాళ్లతో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒక కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. భయాందోళనతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.