భూపాలపల్లిలో ఓ మానసిక వికలాంగురాలు నిండుగర్భంతో ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖకు చేరవేశారు. దీంతో స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బాలల సంరక్షణశాఖ అధికారి ఓంకార్, డీఎంహెచ్వో అప్పయ్య తమ సిబ్బందితో కలిసి ఆ పిచ్చితల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఫలితంగా ఆ మహిళను భూపాలపల్లి పట్టణ శివారులోని రిలయన్స్ పెట్రోల్ పంపు వద్ద ఉండగా గుర్తించారు. ఆ తర్వాత స్థానిక పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నిండు చూలాలు అని గుర్తించారు. పూర్తి వైద్య పరీక్షల కోసం హన్మకొండకు తరలించారు. అయితే, ఆ మహిళను గర్భవతి చేసిన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.