చంద్రబాబుపై మిథున్ రెడ్డి ఫైర్: రైతులను నట్టేట ముంచారు!

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (16:16 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విరుచుకుపడ్డారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. 
 
రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే చాలామంది రైతులు డిఫాల్టర్స్ అయ్యారని మిథున్ రెడ్డి చెప్పారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.
 
ఎన్నికల సమయంలో అన్ని రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి