లోకేష్ ... శవ రాజకీయం చేయటం తగదు...

సోమవారం, 16 ఆగస్టు 2021 (15:28 IST)
ప్ర‌తిదీ వివాదాస్ప‌దం చేయ‌డం, శ‌వ రాజ‌కీయాలు చేయ‌డం తెలుగుదేశం పార్టీకి అల‌వాటు అని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా విమ‌ర్శించారు. లోకేష్.. శ‌వ రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు.

గుంటూరు కాకాని రోడ్ పరమాయ కుంట వద్ద ఆదివారం బీటెక్ విద్యార్థిని ర‌మ్య హత్య సంఘ‌ట‌న ఇపుడు రాజ‌కీయ వివాదంగా మ‌రింది. ర‌మ్య మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు టీడీపీ నాయకులు వ‌చ్చారు. అక్క‌డికి లోకేష్ రాక ముందే శ‌వాన్ని పోస్ట్ మార్టం చేసి పంపుతుండ‌గా, తెలుగుదేశం నాయ‌కులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు.

ఇలా లోకేష్ వ‌చ్చి శవ రాజకీయాలు చేయటం తగదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు. స్టూడెంట్ హత్య జరిగితే, అదేదో రాజకీయ హత్య మాదిరిగా పెద్ద ఎత్తున టిడిపి నాయకులు వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య చేసిన నిందితున్ని పెట్టుకున్నారని, తగిన శిక్ష పడుతుందని తెలిపారు. అయితే, ఇంత నిర్బంధం మ‌ధ్య రమ్య భౌతిక కాయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించి, ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ స‌మ‌యంలో నారా లోకేష్ కి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణ త‌లెత్త‌గా, కొంద‌రు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ద‌శ‌లో ఇద్ద‌రు జిల్లా ఎస్పీలు వచ్చిన గొడవ సర్దుమనగపోవడంతో నారా లోకేష్ ని అక్కడి నుండి ప్ర‌త్తిపాడు పోలీస్ స్టేష‌న్ కి పోలీసులు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు