నరేంద్ర మోడీ గాలిలోనే చంద్రబాబు గెలిచారు.. లేకుంటే?: జగన్

మంగళవారం, 25 నవంబరు 2014 (12:51 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గాలిలోనే చంద్రబాబునాయుడు గెలిచారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లేదంటే చంద్రబాబుకు గెలుపు సాధ్యమయ్యేది కాదన్నారు.
 
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రెండో రోజు సమీక్ష సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కడప ఎంపీగా పోటీ చేసిన సందర్భంగా తనకు వచ్చిన మెజారిటీనే టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిందన్నారు. ఆ అతి స్వల్ప మెజారిటీతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే, తానే అధికారంలోకి వచ్చేవాడినని కూడా జగన్ వ్యాఖ్యానించారు. కాని తాను అబద్ధాలు చెప్పలేనని, చంద్రబాబులా ప్రజలను మోసం చేయలేనని జగన్ విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి