బాసరలో స్కూల్.. కేసీఆర్‌తో చర్చిస్తా: మోహన్ బాబు

శనివారం, 26 జులై 2014 (12:25 IST)
బాసరలో స్కూల్ ఏర్పాటు చేసే దిశగా సినీనటుడు మోహన్ బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో వెలసిన సరస్వతీ అమ్మవారి దేవాలయాన్ని సినీనటుడు మోహన్ బాబు శుక్రవారం దర్శించుకున్నారు. తన మనవరాళ్లు (విష్ణు కుమార్తెలు) అరియానా, వివియానాలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆయన కుటుంబసమేతంగా బాసర విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాసరలో అన్ని సౌకర్యాలతో కూడిన స్కూలు పెట్టాలని ఉందని... ఈ విషయంపై టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. బాసరలో స్కూలు ఏర్పాటుకు కేసీఆర్ అనుమతి తీసుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి