ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య చేశారని ఇరుగుపొరుగు వారు చెపుతున్నారు. ఈ హత్య చేయడానికి మిగతా ఇద్దరు కూతుళ్ళు కూడా తల్లికి సహకరించారని సమాచారం. లక్ష్మి తన కూతుర్ని హత్య చేయడానికి ముందు తన ఇంటి చుట్టూ వున్న సి.సి. కెమెరాలను ధ్వంసం చేయడం విశేషం. బంజారాహిల్స్ పోలీసులు లక్ష్మితోపాటు మిగతా ఇద్దరు కూతుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.