హుదూద్ తుఫాను బాధితులకు రూ.11 కోట్ల విరాళం : ముఖేష్ అంబానీ

ఆదివారం, 19 అక్టోబరు 2014 (13:54 IST)
హుదూద్ తుఫాను బాధితుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 11 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
 
కాగా, హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా భారీగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని ప్రకటించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి