వచ్చే ఎన్నికలల్లో వైఎస్సార్సీపీని విజయ పథంలో నడిపించాలి: ఉప ముఖ్యమంత్రి

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:22 IST)
త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీని విజయ పథంలో నడిపించేందుకు.. పార్టీ కార్యకర్తలు, నాయకులు సంసిద్ధం కావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు అంజాద్బాష అన్నారు.
 
 42వ డివిజన్ పరిధిలోని ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ పార్టీ నూతన కార్యాలయ భవనాన్ని మాజీ మేయర్, కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ బాబుతో కలిసి అంజాద్బాష ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరచిన అభ్యర్థులే అత్యధిక శాతం గెలుపొందారన్నారు.

అదే విజయోత్సాహంతో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల బరిలో దిగిన పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అన్ని స్థానాల్లో అధిక మెజార్టీ గెలుపే..  పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. జిల్లా తరుపున మనమిచ్చే కానుక అన్నారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా 42వ డివిజన్ నాయకులు చల్లా రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, షఫీ, జేజె రెడ్డి, పాక సురేష్, పులి సునీల్ సుభాన్ భాష, అల్లా బకాష్, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు