వాస్తవానికి బేగంపేటలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరే ఉండేది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభ్యంతరం చెప్పడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా నిర్ణయించారు. తాజాగా డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ టెర్మినల్ గా ఖరారు చేశారు.