అస్వస్థతతో తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ఆస్పత్రిలో చేరడంతో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్లో చేరుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తూ తుమ్మలన్నా... రా కదలి రా, బంగారు తెలంగాణలో ఖమ్మం జిల్లా అభివృద్ధి నీతోనే సాధ్యం - ఇట్లు తుమ్మల అభిమానులు అంటూ సత్తుపల్లి బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిశాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొందరు తనను పని కట్టుకుని ఓడించారని తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టిడిపి రెండుగా చీలిపోయింది. దీంతో చంద్రబాబు వద్ద తన ప్రత్యర్థి మాటనే చెల్లుబాటు అవుతుందనే అసంతృప్తితో తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీంతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన నారాలోకేష్ ఆయన్ని బుజ్జగించే పనుల్లో పడ్డారని తెలుస్తోంది.