తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించారు. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు.