తర్వాత శ్మశానంలో శిశువు దొరికిన విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఈ అంశంపై ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. కాగా వేకువజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి శిశువును శ్మశానంలో వదిలి వెళ్లారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిందని పోలీసులు వెల్లడించారు. దానిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.