శ్మశానవాటికలో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం

శనివారం, 25 అక్టోబరు 2014 (10:59 IST)
మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కోమటిచెరువు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అప్పుడు పుట్టిన శిశువు లభ్యమైంది. శనివారం తెల్లవారుజామున శిశువు ఏడుపు వినిపించడంలో స్థానికలు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా పుట్టి కొన్ని గంటలే అయిన శిశువు కనిపించింది. 
 
దిగ్భ్రాంతి చెందిన వారు వారు శిశువును చేరదిసి... 108కి సమాచారం అందించారు. అనంతరం 108 వాహనంలో ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
 
తర్వాత శ్మశానంలో శిశువు దొరికిన విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఈ అంశంపై ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. కాగా వేకువజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి శిశువును శ్మశానంలో వదిలి వెళ్లారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిందని పోలీసులు వెల్లడించారు. దానిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి