అంతర్జాతీయ మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) నిబంధనలను భారత్ పాటిస్తుందని.. ఈ వ్యవహారంలో ఎవరూ ఇండియాను ప్రశ్నించాల్సిన అవసరమే లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇండియాతో పాటు మరో 11 దేశాలు అమెరికాకు చెందిన ఐపీఆర్లను నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారని అమెరికా సంస్థ నివేదిక ఇచ్చిన విషయమై ఆమె స్పందించారు.